![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -335 లో..... రామలక్ష్మి బీరువా నుండి తాళిని తీసి చూస్తూ బాధపడుతుంది. నేను లేకపోతే ఏమవుతారో అనుకున్నాను.. నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకున్నారని రామలక్ష్మి బాధపడుతుంది. కానీ ఒకరకంగా సంతోషంగా ఉంది. మీరు హ్యాపీగా ఉండి మీకంటూ ఒక కుటుంబం ఏర్పర్చుకున్నారు.. ఇక మీదట ఎప్పటికి నేను మైథిలీగానే ఉంటానని రామలక్ష్మి అనుకుంటుంది.
సీతాకాంత్ రామ్ ని తన గుండెల పై పడుకోబెట్టుకొని రామలక్ష్మి గురించి ఆలోచిస్తాడు. ముందు రామ్ కి రామలక్ష్మి పై ఉన్న ఇంప్రెషన్ పోగొట్టాలి.. అప్పుడే మనం రామలక్ష్మి విషయంలో ముందుకు వెళ్ళగలమని అనుకుంటాడు. రామ్ కి రామలక్ష్మి గురించి సీతాకాంత్ మంచిగా చెప్పే ప్రయత్నం చేయగా.. రామ్ వినిపించుకోడు. దాంతో ఈ ప్రయత్నం కంటే రామలక్ష్మిని తన నోటితో రామలక్ష్మి అని చెప్పేలా చెయ్యాలని సీతాకాంత్ అనుకుంటాడు. మరుసటి రోజు మైథిలి ఆఫీస్ కి సీతాకాంత్ వెళ్లి తన గురించి తెలుసుకుంటాడు. ఇంకా తన ఇంటిముందుకి వెళ్లి అక్కడ పని చేసే అతన్ని అడుగుతాడు. తను మా మైథిలి మేడం.. ఇన్ని రోజులు లండన్ లో ఉండి, ఇప్పుడే వచ్చి ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటుందని చెప్తారు. అందరు మైథిలీ అంటున్నారు. మరి నాకెందుకు రామలక్ష్మి అనిపిస్తుందని సీతాకాంత్ అనుకుంటాడు.
ఆ తర్వాత రామ్ ని సీతాకాంత్ స్కూల్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటాడు. వద్దని రామ్ అంటాడు. దాంతో మేం తీసుకొని వెళ్తామని శ్రీవల్లి, శ్రీలత లు రామ్ ని స్కూల్ కి తీసుకొని వెళ్తారు. రామ్ క్లాస్ కి వెళ్ళాక రామలక్ష్మి పై రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాస్టిక్ బల్లితో పాటు ఫ్లోర్ పై ఆయిల్ పోస్తాడు. మరొకవైపు రామ్ క్లాస్ అయిపోయేంత వరకు శ్రీవల్ల, శ్రీలత లు బయట వెయిట్ చేస్తుంటారు. సీతాకాంత్ రామాలక్ష్మిని చూడడానికి స్కూల్ కి వస్తాడు. అక్కడ సీతాకాంత్ ని శ్రీవల్లి చూసి శ్రీలతకి చెప్తుంది. ఎందుకు వచ్చినట్లు వెనకాలే వెళ్తే తెలుస్తుందని ఇద్దరు అనుకుంటారు. రామలక్ష్మి కోసం సీతాకాంత్ వెతుకుతు ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |